బండ్ల గణేష్ ట్వీట్ల వెనుక అంత అర్థం ఉందా.. వామ్మో!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన అనంతరం నిర్మాతగా మారి ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.బండ్ల గణేష్ మైకు పట్టి వేదిక పైకి ఎక్కారు అంటే ఆ వేదిక మొత్తం పవనామస్మరణతో మార్మోగి పోవాల్సిందే.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ బండ్ల గణేష్ ఎన్నో సందర్భాలలో పవన్ జపం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ కు ఆహ్వానం రాకపోవడంతో ఆయన పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చెబుతూ వరుస ట్వీట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి బండ్ల గణేష్ వస్తారని ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా స్పీచ్ ఇస్తారో అని చాలామంది ఎదురు చూసినప్పటికీ ఆయనకు ఆహ్వానం అందలేదని విషయం తెలియడంతో ఒక్కసారిగా నిరాశ వ్యక్తం చేశారు.

ఈ విధంగా బండ్ల గణేష్ సోమవారం ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ పై వరుస ట్వీట్లు పెడుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే అనుకోని కారణాలవల్ల ఏపీ మినిస్టర్ అకాల మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

"""/"/ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి బండ్ల గణేష్ కూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం ఆపివేశారు.

ఇలా ఈ కార్యక్రమం వాయిదా పడగానే బండ్లగణేష్ కూడా ట్వీట్ చేయడం ఆపి వేయడంతో చాలామంది ఇంతవరకు బండ్లగణేష్ తనకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కోసమే ఈ విధంగా ట్వీట్స్ చేశారా.

ఈయన ట్వీట్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

"""/"/ అయితే బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య పరస్పర బేధాభిప్రాయాలు వచ్చాయని అందుకే ఇతనిని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం వాయిదా పడటంతో ఈ చర్చ ఇక్కడికి ఆగిపోయింది అయితే తిరిగి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే రోజున బండ్లన్నకు ఆహ్వానం అందుతుందో లేదో వేచి చూడాలి.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత