పవన్ కోసం డైరెక్టర్ను ఫిక్స్ చేసిన బండ్ల
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి రెడీ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే నిర్మాత బండ్ల గణేష్తో పవన్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దిరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్సింగ్ చిత్రం ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి అలాంటి సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు బండ్ల గణేష్ పక్కా ప్లానింగ్తో వెళ్తున్నాడు.
ఇక ఈ క్రమంలోనే పవన్ కోసం ఓ పవర్ఫుల్ డైరెక్టర్ను ఆయన కన్ఫం చేసినట్లు తెలుస్తోంది.
పూరీ చెప్పిన ఓ స్టోరీలైన్ కథకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో పవన్తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలను అందించిన పూరీ, ఈసారి మరొక అద్భుతమైన కథను పవన్ కోసం రెడీ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పూరీ, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఛార్మీతో కలిసి పూరీ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఈ సినిమాను బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోంది.మరి పవన్ కోసం పూరీ ఎలాంటి కథను రెడీ చేస్తాడా అనేది తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
అటు పవన్ దర్శకుడు క్రిష్తో ఓ సినిమా, సాగర్ చంద్రతో ఓ సినిమా, హరీష్ శంకర్తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు సీజ్