బిజెపి సీనియర్ నాయకులు నేవూరి దేవేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ; బండి సంజయ్ కుమార్

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు నేవూరి దేవేందర్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.

నేవూరి దేవేందర్ రెడ్డి ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుసుకున్న బండి సంజయ్ బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి దేవేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి అతని భార్య నర్మదా , కుమారుడు ప్రణీత్ రెడ్డి , కూతురు హారిక , దేవేందర్ తల్లి వెంకటలక్ష్మి నీ సోదరుడు జితేందర్ రెడ్డిలను పరామర్శించారు.

బండి సంజయ్ ను చూసి దేవేందర్ రెడ్డి భార్య నర్మదా భావోద్వేగానికి గురై బోరున విలపించారు.

ఈ సందర్భంగా నేవూరి దేవేందర్ రెడ్డి చిత్రపటానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

డిగ్రీ చదువుతున్న ప్రణీత్ రెడ్డిని , బాసర త్రిబుల్ ఐటీ చదువుతున్న కూతురు హారిక ను బాగా చదివించాలని మీ కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని అన్ని రకాలుగా ఆదుకుంటుందని , భరోసనిచ్చి వారిని ఓదార్చారు.

అనంతరం బిజెపి సీనియర్ నాయకులు బందారపు లక్ష్మారెడ్డి ఇంట్లో ఏర్పాటుచేసిన తేనెటి విందులో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట శ్రీ లక్ష్మీ కేశవ పెరుమళ్ళ ఆలయం సమీపంలో నిర్మించిన స్మశాన వాటికకు నిధులు ఇప్పించాలని ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బాద రమేష్ , ప్రతినిధులు మేగి నర్సయ్య , బిజెపి పట్టణ అధ్యక్షులు నంది నరేష్ బండి సంజయ్ కు వినతిపత్రం సమర్పించారు.

అక్కడ బిజెపి ఓబీసీ రాష్ట్ర ప్రతినిధి కంచర్ల పర్షరాములు , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దుల బుగ్గారెడ్డి , బిజెపి ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు కోనేటి సాయిలు , సోషల్ మీడియా జిల్లా ప్రతినిధి సాయికిరణ్ నాయక్ , ఓబిసి జిల్లా సెక్రెటరీ సిరిసిల్ల ప్రకాష్ యాదవ్ , నాయకులు పారిపెల్లి సంజీవ్ రెడ్డి , సందుపట్ల లక్ష్మారెడ్డి , రాజిరెడ్డి , రావుల గాల్ రెడ్డి , చేకూటి రాజు యాదవ్ , యమగోండా కిష్టారెడ్డి , బుర్కా వేణు బుర్కా సంగీత , దీటి నర్సయ్య , మానుక రాజు యాదవ్ , బీపేట రమేష్ , తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతున్న శ్రీ లీల.. పెద్ద ప్లానింగే