ఎమ్మెల్యే ఆనంపై బాలినేని పరోక్ష వ్యాఖ్యలు
TeluguStop.com
నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్షమించమని చెప్పారు.వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం అందుకేనని పేర్కొన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వేటు తప్పదని స్పష్టం చేశారు.ఒంగోలులో బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టీడీపీ కావాలనే రాజకీయం చేస్తుందని ఆరోపించారు.