బాలినేనికి వైసీపీలో ఎలాంటి సమస్య లేదు..: విజయసాయి రెడ్డి

మాజీ మంత్రి బాలినేనికి వైసీపీలో ఎలాంటి సమస్య లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ప్రకాశం జిల్లా వైసీపీకి బాలినేని అత్యంత విలువైన నాయకుడని తెలిపారు.వైసీపీలో బాలినేనికి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గదని ఎంపీ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు.

వైసీపీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదలు చేశామన్న ఆయన త్వరలోనే మరో లిస్టును విడుదల చేస్తామని తెలిపారు.

అలాగే వైఎస్ఆర్ మరణంపై గతంలోనే విచారణ జరిగిందన్నారు.రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ అని తెలిపారు.

కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం