బోయపాటి సినిమాని లైన్ లో ఉంచిన బాలయ్య

మాస్ చిత్రాల దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి బోయపాటి శ్రీను.

కెరియర్ లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కమర్షియల్ సినిమాలు తీసిన బోయపాటి సినిమా అంటే హీరోయిజం, అలాగే విలనిజం పీక్ లో ఉంటాయి.

ఈ రెండింటి కారణంగా స్టొరీ ఎలా ఉన్న నడిచిపోతూ ఉంటాయి.దీంతో బోయపాటి కూడా అన్ని సినిమాలు ఒకే తరహా కథ, కథనంతో సినిమాలు తీస్తూ వచ్చాడు.

అయితే జయ జానకి నాయకా సినిమా వరకు బోయపాటి మేకింగ్ కి ఒకే చెప్పిన జనం వినయ విదేయ రామా సినిమాలో అతని అతి ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్ ని దారుణంగా తిప్పి కొట్టారు.

గ్రాండియర్ కోసం ఊహాజనితమైన సన్నివేశాలు జోడించి సినిమాని డిజాస్టర్ చేసేసాడు.ఇదిలా ఉంటే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే సింహ, లెజెండ్ సినిమాలు గుర్తుకొస్తాయి.

ఇక విజయ విదేయ రామా సినిమా తర్వాత బాలయ్య బోయపాటితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మళ్ళీ మూస కథని తీసుకెళ్ళి విపించడంతో బాలయ్య అతనిని పక్కన పెట్టి కెఎస్ రవికుమార్ తో సినిమాకి కమిట్ అయిపోయాడు.

అయితే బోయపాటి కథలో మార్పులు చెప్పి ఈ సారి ఓవర్ డ్రామా కాకుండా కాస్తా కొత్తదనం ఉన్న విధంగా కథని సిద్ధం చేయమని చెప్పడంతో ఇప్పుడు దర్శకుడు ఆ పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

అయితే ఇక బోయపాటి, బాలయ్య సినిమాలో బాలకృష్ణకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో బోయపాటి సినిమాని బాలయ్య లైన్ లో పెట్టాడని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

పైటకొంగు అగనంటుంది అంటున్న ఇషితా.. మరి ఇంత అందమా?