సినీ కెరియర్ లోనే మొదటిసారి యాడ్ చేయడానికి సిగ్నల్ ఇచ్చిన బాలయ్య!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఆ హీరోకి ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించే అవకాశం వస్తుంటుంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతోమంది హీరోలు వరుస కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల డబ్బు సంపాదిస్తున్నారు.

ఇలా ఒకవైపు సినిమాలలోను, మరోవైపు యాడ్స్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు.అయితే సీనియర్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి హీరోలందరూ కూడా యాడ్స్ లో సందడి చేస్తున్నారు.

అయితే వీరితో పాటు అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లో నటించలేదు.

అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈయన తన సినీ కెరియర్ లోనే మొదటిసారి కమర్షియల్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే బాలయ్య ఏ యాడ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు అనే విషయానికి వస్తే.

"""/"/ బాలయ్య మొదటిసారి శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ యాడ్‌లో బాలకృష్ణ తొలిసారిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ బాలకృష్ణకు శ్రేయాస్ మీడియా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలకృష్ణ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా తమ అభిమాన హీరో వెండితెరపై అలాగే వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఇలా కమర్షియల్ యాడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జానీ మాస్టర్ కు అవార్డ్ విషయంలో అసలు ట్విస్ట్ వేరే ఉందా.. అలా చేసి ఉంటే బాగుండేదా?