బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ ఎందుకొచ్చింది..!

నందమూరి బాలకృష్ణ ఫర్ ద ఫస్ట్ టైం ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా మారుతున్నారు.

అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో వస్తుంది.

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో కాన్సెప్ట్ ఏంటి.గెస్టులు ఎవరు.

ఈ టాక్ షో ఎలా నడుస్తుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే అన్ స్టాపబుల్ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

బాలయ్య మార్క్ డైలాగ్స్ తో ఈ ప్రోమో అదిరిపోయింది.అన్ స్టాపబుల్ ప్రోమోతోనే సూపర్ అనిపించాడు బాలయ్య బాబు.

అయితే ఈ షో స్పాన్సర్ షిప్ కేటగిరిలో ఎవరు ఊహించని విధంగా మ్యాన్షన్ హౌజ్ కనిపించింది.

బాలయ్యకు మ్యాన్షన్ హౌజ్ కు సంబంధం ఏంటి అని అనుకోవచ్చు.బాలయ్య ఫేవరెట్ బ్రాండ్ అదని మీడియాలో ఒకటే టాక్.

అయితే ఇప్పుడు అదే బ్రాండ్ ను ఈ షోకి స్పాన్సర్ గా పెట్టడం షాకింగ్ గా ఉంది.

ఏది ఏమైనా అన్ స్టాపబుల్ షో ప్రోమోలో మ్యాన్షన్ హౌజ్ కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసింది.

ఇక ప్రోమోలో వెన్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అంటూ బాలయ్య మార్క్ గర్జనతో షో మీద ఆసక్తి పెరిగేలా చేశారు.

మరి అన్ స్టాపబుల్ షో ఎలా ఉంటుంది అన్నది చూడాలి.మొదటి గెస్ట్ గా మంచు మోహన్ బాబు వచ్చినట్టు తెలుస్తుంది.

నవంబర్ 4 దీపావళి సందర్భంగా పండుగ రోజు ఆహాలో అన్ స్టాపబుల్ షో రానుంది.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు..!