శ్రీవాస్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ మూవీ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.

ఇది పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.

ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని గోపీచంద్ ఈ కథని సిద్ధం చేసుకున్నట్లు బోగట్టా.

ఇక ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్యకి ప్రతినాయకిగా కనిపించబోతుంది.ఇదిలా ఉంటే గోపీచంద్ తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడం కోసం అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ రెడీగా ఉన్నారు.

అలాగే ఇప్పుడు ఈ లిస్టులోకి దర్శకుడు శ్రీవాస్ కూడా వచ్చి చేరాడు.శ్రీవాస్ చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సాక్ష్యం మూవీ తెరకెక్కించారు.

"""/"/ ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇక శ్రీవాస్, బాలకృష్ణ కాంబినేషన్లో డిక్టేటర్ మూవీ ఇప్పటికే తెరకెక్కింది.

ఆ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.మరో సారి శ్రీవాస్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథని బాలకృష్ణకి చెప్పడం జరిగిందని తెలుస్తుంది.

ఇక బాలయ్య కూడా ఈ మూవీ చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు టాక్ .

అయితే దానికి ఇంకా కొంత సమయం పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.ఇక శ్రీవాస్, బాలకృష్ణ కాంబోలో మూవీని సి కళ్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఇక బాలకృష్ణ మూవీ కంటే ముందుగా శ్రీవాస్ ఓ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఆ మూవీని గోపీచంద్, రాజశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నారు.ఇది ఇప్పటికే ఫైనల్ అయినట్లు బోగట్టా.

దీనిని పూర్తి చేసి బాలకృష్ణ మూవీని శ్రీవాస్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు..: హరీశ్ రావు