రూలర్ దెబ్బకి భయపడుతున్న బోయపాటి సినిమా నిర్మాత...

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం రూలర్.ఈ చిత్రం ఈనెల 20వ తారీఖున విడుదలై బ్లాక్ బస్తర్  టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన సోనాల్ చౌహాన్ వేదిక కథానాయికలుగా నటించారు.

ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు.

అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అంతేగాక ఈ చిత్రంలో బాలకృష్ణ కొత్త లుక్ పై అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.

అయితే ఇదే ఇలా ఉండగా గతంలో తన తండ్రి నందమూరి తారక రామారావు గారి బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.దీంతో ఇప్పుడు ఆ ప్రభావం బాలయ్య బాబు సినీ కెరియర్ పై పడినట్టు తెలుస్తోంది.

అయితే రూలర్ చిత్రం తర్వాత బాలయ్య బాబు బోయపాటి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పగా ఇప్పటికే ఈ సినిమాను పలువురు పెద్దల సమక్షంలో ప్రారంభించారు.

ఈ చిత్రానికి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. """/"/అయితే రూలర్ చిత్రం ఫలితాలు తెలుసుకున్న రవీందర్ రెడ్డి ప్రస్తుతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అంతేగాక కథానాయకుడు బాలయ్య బాబు, దర్శకుడు బోయపాటి శ్రీను పారితోషికానికి బదులుగా సినిమా విడుదల తర్వాత వచ్చిన లాభాల్లో వాటా తీసుకునేందుకు ఒప్పుకుంటే నే ఈ చిత్రాన్ని నిర్మిస్తారని లేదంటే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించలేనని చెప్పినట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తున్నాయి.

దీంతో నిర్మాత పెట్టిన కండిషన్లకు బాలయ్య బాబు, బోయపాటి శ్రీను లు ఒప్పుకోకపోవడంతో తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

  దీంతో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టును ఎవరైనా నిర్మాతగా చేస్తారా అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు పలువురు నిర్మాతలను సంప్రదించినట్లు సమాచారం.

అయితే చూడాలి మరి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు అనేది. .

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??