త్రివిక్రమ్ దర్శకత్వంలో బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్..?
TeluguStop.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది.
ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డును క్రియేట్ చేయడంతో త్రివిక్రమ్ తన ఖాతాలో మరో బ్లాక్బస్టర్ను వేసుకున్నాడు.
కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేసే పనిలో పడ్డారు.
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమా చేసిన సమయంలోనే ఆయనతో మరో సినిమాకు ఒప్పుకున్నారు.
ఇక తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తున్నాడని, ఆయన ఈ సినిమాలో కేవలం గెస్ట్ పాత్రలో మాత్రమే నటిస్తాడని తెలుస్తోంది.
బాలయ్య-ఎన్టీఆర్లు కలిసి నటించాలని ఎప్పటి నుండో చూస్తున్న నందమూరి అభిమానులు వెయిట్ చేస్తుండగా, వారి కలను త్రివిక్రమ్ నెరవేరుస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేయాలని చూస్తున్నాడట.
మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
పుష్ప 2 ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?