బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా కథ ఇదేనట!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ చేస్తున్న సినిమా అఖండ.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమా షూట్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అన్ని సక్రమంగా ఉంటే దసరా పండుగకు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు.

గోపీచంద్ మలినేని మాస్ రాజా రవితేజ తో తీసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బాలయ్య ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక పవర్ ఫుల్ కథను కూడా రెడీ చేసాడని ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట.

అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ప్రచారం జరుగుతుంది.ఇటీవలే గోపీచంద్ మలినేని ఒక కథను బాలయ్యకు వినిపించాడని బాలయ్య కూడా కథను ఓకే చేసాడని సమాచారం.

ఈ కథలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని టాక్.

ఈ కథ మొత్తం రాయలసీమ, కర్ణాటక బోర్డర్ మధ్యనే సాగుతుందట. """/"/ యాక్షన్, ఎమోషన్ తో పాటు కామెడీ కూడా సమపాళ్లలో ఉండేలా గోపీచంద్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అదిరిపోయేలా డిజైన్ చేసాడట.ఇంకా ఈ సినిమాలో బాలయ్య ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో బాలయ్య టైమింగ్ బాగుంటుందని వెటకారం కూడా కాస్త ఎక్కువుగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు.

మొత్తానికి బాలయ్యను ఎనర్జిటిక్ గా చూపించ బోతున్నారని తెలుస్తుంది.

చెంపలపై మొటిమలు మచ్చలు అస్స‌లు పోవడం లేదా.. అయితే ఇదే మీకు బెస్ట్ సొల్యూషన్!