అభిమానికి కాల్ చేసిన బాలయ్య.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్ ..?

దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి వరుస సినిమాల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు బాలకృష్ణ.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో హీరోగా నటిస్తూ ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

లక్షల సంఖ్యలో వీరాభిమానులను కలిగి ఉన్న బాలకృష్ణ తాజాగా ఒక అభిమానికి కాల్ చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.

అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసిన బాలకృష్ణ నెల్లూరు జిల్లా కావలిలో వీరాభిమాని పత్తి మనోహర్ అనారోగ్యంతో బాధ పడుతుంటే ఓదార్చారు.

తను అభిమానించే హీరో కాల్ లో మాట్లాడటంతో అభిమాని భావోద్వేగానికి గురై ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

పత్తి మనోహర్ అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ మామూలు మనిషి అవుతారని బాలకృష్ణ ధైర్యం చెప్పారు.

కుటుంబ సభ్యుడిని కాపాడుకోవడం తన హక్కు అని తమ వాళ్లంతా అండగా ఉంటారని బాలకృష్ణ అన్నారు.

పత్తి మనోహర్ భార్యతో కూడా మాట్లాడిన బాలయ్య మనోధైర్యంతో ఉండాలని ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని సూచనలు చేశారు.

మన వాళ్లంతా అవసరమైన సహాయసహకారాలు అందిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు.బాలయ్య ఆప్తులలో ఒకరైన కోటంరెడ్డి పత్తి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించడంతో పాటు పత్తి మనోహర్ కు భరోసా ఇచ్చారు.

బాలయ్య చేసిన పని నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు బాలకృష్ణను ప్రశంసిస్తున్నారు. """/"/ మరోవైపు బాలకృష్ణ కొత్త సినిమాలకు కమిటవుతున్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా టైటిల్ కు సంబంధించి చాలా వార్తలు వైరల్ అవుతుండగా వచ్చే నెలలో వచ్చే నెలలో టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సినిమా తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

క్రాక్ సినిమా తరువాత గోపీచంద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో బాలీవుడ్ నటుడు…