కేవలం 24 నిమిషాల్లో ముగించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.

గతంలో బాలయ్యకు సింహా, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీలను అందించిన బోయపాటి చెప్పిన కథ బాగా నచ్చడంతో మరోసారి ఆయనతో సినిమాను ఓకే చెప్పాడట.

కాగా బాలయ్యతో తెరకెక్కించిన సింహా చిత్రం కోసం బోయపాటి బాలయ్య చుట్టూ ఎన్ని చక్కర్లు కొట్టారో అని అప్పట్లో అందరూ అనుకునే వారట.

అయితే ఈ కాంబో సెట్ అయ్యేందుకు ఎంత సమయం పట్టిందో బోయపాటి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.

సింహా కథను బాలయ్య కేవలం 24 నిమిషాలలో ఓకే చేసినట్లు తెలిపాడు.అప్పట్లో ఓ వివాహంలో బాలయ్యను కలుసుకున్న బోయపాటి, ఆయనతో మాట్లాడారు.

ఈ క్రమంలో బోయపాటితో సినిమా చేస్తానని, ఏదైనా కథ ఉందా అంటూ బాలయ్య అడిగారట.

దీంతో తనవద్ద ఉన్న సింహా కథను బాలయ్యకు వివరించారట.వెంటనే ఈ సినిమాపై తన నిర్ణయాన్ని మూడు రోజుల్లో చెప్తానని బాలయ్య అక్కడి నుండి వెళ్లిపోయారట.

కట్ చేస్తే.మూడు రోజుల తరువాత బాలయ్య బోయపాటికి ఫోన్ చేసి ‘మనం సినిమా చేస్తున్నాం.

కథను పూర్తిగా డెవలెప్ చేయండి’ అంటూ కోరాడట.దీంతో బాలయ్య-బోయపాటి కాంబో సెట్ అయ్యి సింహా లాంటి సెన్సేషనల్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక సింహా చిత్రం ఎలాంటి చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఇదే తరహాలో తమ కొత్త చిత్రం కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని బోయపాటి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు