జరిగేది ‘అఖండ’ తాండవం అంటున్న బాలకృష్ణ.. వీడియో వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.'మాస్ ఆఫ్ ద గాడ్' గా బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

బాలయ్య - బోయపాటి శీను దర్శకత్వంలో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కించిన సంగతి అందరికి విదితమే.

ఆ సినిమాలన్నీ భారీ విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో మరోమారు బోయపాటి( Boyapati Srinu ) దర్శకత్వంలో బాలయ్య హీరోగా నాలుగవ సినిమాగా 'అఖండ 2( Akhanda 2 )' రాబోతుంది.

ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతోంది. """/" / ఇకపోతే, నేడు (బుధవారం) బాలకృష్ణ కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని చేతుల మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, తేజస్విని కెమెరా ఆన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ పూజా కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్య బాబు డైలాగు చెప్పి అందర్నీ ఆకట్టుకున్నాడు.

అఖండ 2 సినిమాలోని ఒక డైలాగును బాలయ్య బాబు చెప్పారు.అదేంటంటే.

"ఈ నేల అసురుడిది కాదు.ఈశ్వరుడిది పరమేశ్వరుడిది.

కాదని, తాకితే జరిగేది తాండవం 'అఖండ తాండవం'" అంటూ బాలయ్య ( Balakrishna )అదరగొట్టేశాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. """/" / ఆ వీడియోలో థమన్ బీజీఎంలో డైలాగ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారిగా ఊహకు అందడం లేదని అభిమానులు అంటున్నారు.

ఇక అఖండ 2 సినిమా షూటింగ్ మొదలవ్వకముందుకే అభిమానులలో భారీ అంచనాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా, ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.బాలయ్యను ఉద్దేశిస్తూ అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హీరో ఖచ్చితంగా అవుతారని తెలిపారు.

ఇక ఈ సినిమాకు థమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకు సి.రామప్రసాద్ కెమెరామెన్ గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేయబోతున్నారు.

సెకండ్ పార్ట్స్ సినిమాలు తీసి హిట్టు కొట్టడం అంత తేలిక కాదు గురూ?