కొండగట్టు అంజన్న సేవలో ప్రత్యేక పూజలు చేసిన బలగం డైరెక్టర్?

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా స్కిట్లు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసిన కమెడియన్ వేణు( Venu ) అనంతరం పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ సందడి చేశారు.

అయితే ఈయనకు దర్శకత్వంపై ఎంతో ఇష్టం ఉండడంతో అటువైపు తన ప్రయాణం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కిన బలగం ( Balagam ) సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

దిల్ రాజు కుమార్తె హన్షిత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాలో ప్రియదర్శి ( Priyadarshi ) కావ్య కళ్యాణ్ రామ్ ( Kavya Kalyan Ram ) జంటగా నటించారు.

"""/" / ఇలా ఈ సినిమా మార్చి మూడవ తేదీ విడుదల అయ్యి కేవలం మౌత్ టాక్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక చిన్న సినిమాకు విడుదలైన ఈ సినిమా అతిపెద్ద విషయాన్ని అందుకుంది.కంటెంట్ ఉంటే బడ్జెట్ తో సంబంధం లేదని కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి బలగం సినిమా నిరూపించుకుంది.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఎంతోమంది వేణు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈయనకు దర్శకుడిగా మరికొన్ని అవకాశాలు కూడా వెళ్లవెత్తుతున్నాయి. """/" / ఇలా బలగం సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో తాజాగా ఈయన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని( Kondagattu Anjaneya Swamy Temple ) దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ క్రమంలోని ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వేణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

బలగం సినిమా ప్రారంభించడానికి ముందు కొండగట్టు అంజన్న ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమాని ప్రారంభించానని అయితే ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకొని మీ ఆశీర్వాదంతో మంచి సక్సెస్ అయ్యింది అంటూ ఈయన తెలియచేశారు.

ఇలా ఈ సినిమా సక్సెస్ కావడంతో మరోసారి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ఈయన ప్రత్యేక పూజలు చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒమన్ సముద్రంలో మునిగిన చమురు నౌక .. 16 మంది గల్లంతు, అందులో 13 మంది భారతీయులే