విశ్వక్ వివాదంపై తొలిసారి స్పందించిన సాయి రాజేష్.. ఎప్పుడూ అవమానించలేదంటూ?

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం బేబీ( Baby ).

ఈ మూవీకి సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి విజయాన్ని అందుకుంది.

పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు నుంచే సాయి రాజేష్, హీరో విశ్వక్‌సేన్‌( Sai Rajesh, Vishwaksen ) మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇదే విషయంపై అనేక రకాల వార్తలు వినిపించాయి. """/" / ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వివాదంపై తొలిసారి దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు.

బేబీ కథ మొదట విశ్వక్‌సేన్‌ వద్దకే వెళ్లింది.కానీ ఆయన దీనిని రిజక్ట్‌ చేశారు.

బిజీ షెడ్యూల్‌ వల్ల కథను వద్దనుకున్నారా? లేదా మరేదైనా కారణమా? అనేది అయితే తెలియదు.

అయితే ఇటీవల ఆయన ఒక ప్రెస్‌మీట్‌లో పాల్గొని.హిట్‌లో ఉన్నారు.

దాన్ని ఎంజాయ్‌ చేయండి.అవతలివాళ్లను అనుమానించవద్దు అన్నారు.

ఇప్పటివరకూ నేను ఆయన పేరు ఎక్కడా చెప్పలేదు.ఆయన్ని అవమానించే ఉద్దేశం కూడా నాకు లేదు.

నా వద్ద కథ ఉందంటూ ఒకసారి గీతా ఆర్ట్స్‌ సంస్థ( Geeta Arts Company ) విశ్వక్‌సేన్‌ కు ఫోన్‌ చేసింది.

దానిని ఆయన రిజక్ట్‌ చేశారు. """/" / విశ్వక్‌ ఏమైతే అన్నాడో ఆ మాటలను ఫిల్టర్‌ చేయకుండా ఆ సంస్థ వాళ్లు నాతో చెప్పారు.

బాధగా అనిపించింది.ఆయన ఆ మాటలు అనడానికి కారణాన్ని నేను అర్థం చేసుకోగలను.

తిరస్కరణ కూడా మర్యాద పూర్వకంగా ఉంటే బాగుంటుందనిపించింది అని సాయి రాజేశ్‌ చెప్పుకొచ్చారు.

సాయి రాజేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

విశ్వక్‌సేన్‌ పై మండిపడుతున్నారు.రెండు మూడు హిట్ సినిమాలు వచ్చేసరికి విశ్వక్‌సేన్‌ కి పొగరు ఎక్కువ అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

‘రైతు యాత్ర ‘ తో జనాల్లోకి కేసీఆర్