ఎన్టీఆర్ ఆశీర్వాదం ఉంటేనే టీడీపీకి పూర్వవైభవం.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ప్రజల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు అర్థం కావడం లేదు.

చంద్రబాబుకు వయస్సు పెరుగుతుండటంతో పార్టీ బాధ్యతలను పూర్తిస్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగిస్తే మంచిదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

తాజా బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకుపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ వాటిని ప్రూవ్ చేయాలని బాబు మోహన్ అన్నారు.

యూత్ తో సైకిల్ మోటార్ ర్యాలీలో పాల్గొనడం తప్ప తన కొడుకు ఏం చేయలేదని బాబు మోహన్ పేర్కొన్నారు.

బంగారు తెలంగాణ ఆచరణ సాధ్యమైందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.వాళ్ల ఇళ్లు, మనవళ్లు, కోడళ్లు అందరూ కోటీశ్వరులు అయ్యారని బాబు మోహన్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

ప్రగతి భవన్ అంతా బంగారు తెలంగాణ అని బాబు మోహన్ వెల్లడించారు.ప్రగతి భవన్ లోనే కేసీఆర్ ఉంటారని బాబు మోహన్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఎక్కడ ఉంటే అది బంగారు తెలంగాణ అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

"""/"/ ఎవరు తప్పు చేసినా తాను తప్పు అని చెబుతానని పేద ప్రజల సొమ్ము అమ్ముకుంటానంటే మాత్రం తాను ఒప్పుకోనని బాబు మోహన్ తెలిపారు.

త్రికరణ శుద్ధితో రాజకీయాల్లోకి వెళ్లానని సీనియర్ ఎన్టీఆర్ ఆశీర్వాదం ఎవరిపై ఉంటుందో వాళ్ల నుంచే తెలుగుదేశంకు పూర్వవైభవం వస్తుందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

"""/"/ ఇప్పట్లో తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం దాల్చే ఛాన్స్ అయితే లేదని బాబు మోహన్ అభిప్రాయపడ్డారు.

సీనియర్ ఎన్టీఆర్ పైన బాధ పడుతూ ఉంటాడని బాబు మోహన్ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే టీడీపీకి పూర్వ వైభవం రావచ్చు రాకపోవచ్చని బాబు మోహన్ అన్నారు.

వాట్సాప్ లో సరికొత్తగా ఫిల్టర్స్ ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..?