మల్యాల ఊరి బావినీళ్ళకు ఆయుర్వేద శక్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోరుట్ల పట్టణలను కలిపే మార్గం మధ్యలో వేములవాడ నుండి 18 కిమీ దూరంలో మా గ్రామం మల్యాల అనగానే సుదూర ప్రాంతాల వారికి, చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలకు గుర్తుకు వచ్చేది చుండేబుక బావి నీళ్ళూ ఈ విశ్వంలో ప్రతిజీవి మనుగడకు గాలి తరువాత ముఖ్యమై నది నీరు ఈ బావి యొక్క ప్రత్యేకతలు చుండెలుక కరచి చర్మ వ్యాధులు, మంటలు దురద వంటి రోగాలకు మా ఈ చుండెలుక బావి నీళ్ళీ ఔషధం మనుష్యులకే కాకుండా.

సాదు జంతువులకు కూడా ఈ నీళ్లు ఔషధం లాగా పనిచేస్తాయి.ఆదివారం, గురువారం ఏరు వారాలు ఈ బాని నీళ్లతొ స్నానం చేయడం (ఎదమ చేత్తో చేసుకోవడం ఎడమ చేత్తో ఏడు బుక్కల నీళ్లు తాగడం) వంట కూడా ఈ నీళ్లతోనే చేసుకోవడం వల్ల చాలా వరకు చాలా మందికి చర్మవ్యాదులు తగ్గుతాయి.

ఈ బావి నీళ్లతో స్నానం కోసం డాక్టర్ల చుట్టు తిరిగిన ఎన్ని మందులు వాడిన తగ్గని చర్మ వ్యాదులు వరంగల్, హైదరాబాద్, నిజమాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చి బావి నీటితో వంట చేసుకొని వ్యాధి తగ్గేవరకు ఇక్కడే ఉండి వ్యాధి తగ్గినవారు ఉన్నారు.

పెద్దలు చెప్పిన మాటఈ బావి ఎలా వెలసిందివేల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి ఒక సన్యాస స్వామీజి వచ్చి గ్రామంలో భిక్షాటన చేసుకుంటు గ్రామాను కాస్త దూరంగా నివాసం ఉండేవాడు గ్రామంలోని కొందరు చుండెలుక కరచి చర్మం వుందులుగా తయారయ్యి దురదతో ఉబ్బంది పడటం చూసి వారిని తన నివాస స్థలానికి పిలచీ తన చేతులతో ఒక నీటి గుంట తవ్వి అందులో పంచ లోహాలు మరియు రాగి పత్రాన్ని ఆ గుంటలో పెట్టి గుంటలో నీళ్లతో ఏడు వారాలు స్నానం చెయ్యమని చెప్పగా తన చర్మ రోగం నయం కావడంతో ఆ కుంటాను బావిగా తవ్వి గ్రామస్తులు చర్మవ్యాదులకు నమ్మకంతో స్నాన మాచరిస్తున్నారు.

బురఖా ధరించి బైక్ పై రెచ్చిపోయిన యువకుడు.. చివరికి.?