ఓటు హక్కు వినియోగంపై అవగాహన
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆద్వర్యంలో రంగోలి, మెహందీ పోటీలు నిర్వహించారు.
(స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రా్రాల్ పార్టిసిపేషన్ ) ఆద్వర్యంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ( Collector Anurag Jayanthi )ఆదేశాల మేరకు కోనరావుపేట, వీర్నపల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య భవనాల్లో మంగళవారం రంగోలి పోటీలు నిర్వహించారు.
సమాఖ్య బాధ్యులు 'ఐ ఓటు ఫర్ ష్యూర్' ఓటు హక్కు నా బాధ్యత'పేరిట ముగ్గులు వేశారు.
అనంతరం అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, అడిషనల్ డీఆర్డీఓ గొట్టే శ్రీనివాస్ డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నా.
రికార్డుల రాజాసాబ్.. మోషన్ పోస్టర్ తో ప్రభాస్ ఖాతాలో సరికొత్త రికార్డ్ చేరిందిగా!