నేవూరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలోఅవార్డు గ్రహీతకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతీయ అవార్డు గ్రహీత ముత్యాల ప్రభాకర్ రెడ్డికి నేవూరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేవూరి రెడ్డి సంఘం భవనంలో గురువారం ముత్యాల ప్రభాకర్ రెడ్డికి శాలువతో సత్కరించి సన్మానం ఏర్పాటు చేశారు.

ఇటీవల తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు విశిష్ట కళా రత్న జాతీయ పురస్కారం హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో జాతీయ అవార్డును ఫోటో రంగంలో కృషి చేసినందుకు ముత్యాల ప్రభాకర్ రెడ్డికి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నేవూరి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి నవజీవన్ రెడ్డి, ముత్యాల వెంకటరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి,ముత్యాల లింగారెడ్డి,దేవేందర్ రెడ్డి, దుబ్బ ఎల్లారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుష్ప కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..? లాంగ్ రన్ లో పుష్ప కలెక్షన్స్ ఎంత రావచ్చు..?