చివరి నిమిషంలో మానవత్వాన్ని చాటిన రెస్టారెంట్ యాజమాన్యం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మానవత్వం కనుమరుగయ్యి, పక్క వాళ్ళు ఎలా చస్తే నాకేంటి నేను, నా కుటుంభం బాగున్నామా లేదా అనే ఆలోచించే మనుషులు ఉన్న ఈ కాలంలో ఇంకా మనుషులలో మానవత్వం అనేది చావలేదు అని ఈ రెస్టారెంట్ సిబ్బంది చేసిన పనే ఒక ఉదాహరణ అని చెప్పాలి.

ఆకలితో ఉన్నవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చే మనుషులను మనం చూసే ఉంటాము.

అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడిన గొప్ప మనుషుల గురించి కూడా మనం వినే ఉంటాము.

అలాంటి వారిని చూసినప్పుడు ఇంకా మానవత్వం అనేది బతికే ఉందా అని.సరిగ్గా ఈ రెస్టారెంట్ యాజమాన్యం కూడా అలాంటి పనే చేసి ఒక మనిషి ఆకలి తీర్చింది.

ప్రస్తుతం చాలామంది ఇంట్లో వంట చేసుకోలేని వారు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుని తింటున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కూడా రెస్టారెంట్ క్లోజ్ చేసే లాస్ట్ మినిట్ లో తనకు ఆన్ లైన్ ఫుడ్ కావాలని ఆర్డర్ చేయడంతో ఆ రెస్టారెంట్ వాళ్ళు చేసిన పని ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

చాలా మంది నెటిజన్లు అయితే ఆ రెస్టారెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కూడా.

మరి ఇంతకీ ఆ రెస్టారెంట్ ఏమి పని చేసింది.? చివరి నిమిషాల్లో ఆ వ్యక్తి ఆర్డర్ స్వీకరించారా లేదా అనే విషయాలు తెలుసుకుందామా.

"""/"/ ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తనకు చాలా ఆకలిగా ఉందని, తనకి ఫుడ్ కావాలంటూ రెస్టారెంట్ కు ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు.

నిజానికి ఒక 14 నిమిషాల్లో ఆ రెస్టారెంట్ క్లోజ్ చేయబడుతుంది.అది గమనించిన ఆ వ్యక్తి తన ఫుడ్ ఆర్డర్ తో పాటు ఒక నోట్ ను కూడా ఆ రెస్టారెంట్ కు పంపించాడు.

నేను చివరి నిమిషంలో ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నందుకు నన్ను క్షమించాలని, నాకు ఆరోగ్యం బాగా లేదని, అందుకే ఇప్పడే నిద్ర లేచినట్లుగా, నాకు బాగా ఆకలిగా ఉందని అందుకే ఇప్పుడే ఆర్డర్ చేయడం జరిగిందని ఆ నోట్ లో వివరించాడు.

"""/"/ ఒకవేళ తన ఆర్డర్ కనుక క్యాన్సిల్ చేస్తే మీ రెస్టారెంట్ క్లోజ్ అయ్యిందని నేను భావిస్తానని కూడా ఆ నోట్ లో తెలిపాడు.

ఈ నోట్ ను చదివిన రెస్టారెంట్ సిబ్బంది అతనిపై మానవత్వం చూపించడంతో పాటు ఆ కస్టమర్ కు ఉచితంగా గార్లిక్ బ్రెడ్ కూడా పంపారు.

అలాగే హోటల్ సిబ్బంది కూడా ఓ నోట్ ను పంపించారు.లేట్ గా ఆర్డర్ చేసినందుకు బాధ పడకండి, మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామని తెలిపారు.

తన ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు ఇలా గార్లిక్ బ్రెడ్ ను ఫ్రీగా పంపించడంతో ఆ వ్యక్తి చాలా సంతోషించి ఆ రెస్టారెంట్ కు 5స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ ఉద్యోగి ఈ ఘటనకు సంబందించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ పోస్ట్ కాస్త తెగ వైరల్ గా మారింది.రెస్టారెంట్ ను, రెస్టారెంట్ సిబ్బందిని పొగిడే పనిలో పడ్డారు మన నెటిజన్లు.

MP Ranjith Reddy : అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లా..: ఎంపీ రంజిత్ రెడ్డి