మరణానికి ముందు ఆసుపత్రిలో వైద్యులతో జయలలిత మాట్లాడిన ఆడియో లీక్
TeluguStop.com

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వార్తలు ఇటీవల మళ్లీ వరుసగా వెలుగులోకి వస్తూ సంచలనం రేపుతున్నాయి.


జయలలిత 2016 డిసెంబరు 5న కన్నుమూశారు.అప్పటి నుంచి ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు అల్లుకున్నాయి.


జయ మరణం, అందుకు దారితీసిన పరిస్థితులపై అసలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు అప్పటి తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటు చేసింది.
ఆ కమిషన్ రూపొందించిన నివేదిక ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి చేరింది.దీంట్లో అత్యంత ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
ఆ తర్వాతి నుంచి జయ మృతికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా, ఆసుపత్రిలో జయలలిత మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది.
స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!