యూట్యూబర్‌పై దాడి.. మెడలో చెప్పుల దండవేసి మరీ?

యూట్యూబర్‌పై దాడి మెడలో చెప్పుల దండవేసి మరీ?

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యూట్యూబ్( Youtube ) ను ప్రభావశీలంగా ఉపయోగించుకుంటున్నారు.

యూట్యూబర్‌పై దాడి మెడలో చెప్పుల దండవేసి మరీ?

అయితే కొంతమంది యూట్యూబర్లు తమ వీడియోల ద్వారా వివాదాలకు కేంద్రబిందువవుతున్నారు.తాజాగా, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో( Rajendranagar ) యూట్యూబర్ గిరీష్‌పై( Youtuber Girish ) జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యూట్యూబర్‌పై దాడి మెడలో చెప్పుల దండవేసి మరీ?

ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు.యూట్యూబర్‌ గిరీష్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.

ఈ వీడియోలలో గిరీష్‌ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించిన దృశ్యాలు కనిపించాయి.

దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఒక వర్గం గిరీష్‌ బ్లాక్‌మెయిల్‌కు( Blackmail ) పాల్పడినందుకే ప్రజలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతుండగా.

, మరొక వర్గం వ్యక్తిగతంగా ఎవరికైనా నచ్చని వ్యక్తిని అలా వేధించడం తగదని వాదిస్తున్నారు.

"""/" / ఈ ఘటనపై రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

గిరీష్‌పై దాడి జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకున్న నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మొత్తం 45 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మిగిలిన 40 మందిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నారు. """/" / ఇక ఈ ఘటనపై బాధితుడు గిరీష్‌ మాట్లాడుతూ తనపై జరిగిన దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధమైందని ఆరోపించాడు.

తన కార్యాలయంపై సైతం ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, ఇందులో కొన్ని రాజకీయ కోణాలున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశాడు.

రాజేంద్రనగర్ సర్కిల్‌లోని హైదర్ గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న గిరీష్‌ దారమోని, ‘ద చిత్రగుప్త’ అనే యూట్యూబ్‌ ఛానల్ నడుపుతున్నాడు.

ఈ ఛానల్‌ ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడన్న ఆరోపణలు విస్తృతంగా వెలుగులోకి వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొంతమంది గిరీష్‌ నివాసానికి వెళ్లి వివరణ కోరారు.

అయితే, వారిపై గిరీష్‌ కారంపొడి చల్లి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.ఈ ఘటన తరువాత అతడిపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు గిరీష్‌ను పట్టుకుని అతని మెడలో చెప్పుల దండేసి ఊరేగించారు.

ఈ కేసు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.యూట్యూబర్‌ గిరీష్‌ నిజంగానే బ్లాక్‌మెయిల్‌కి పాల్పడినట్టేనా? లేక అతనిపై రాజకీయ కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలు మరిన్ని చర్చలకు దారితీర్చాయి.ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.

నన్ను దేవుడు అందంగా పుట్టించాడు…ఆ అవసరం రాలేదు… రకుల్ కామెంట్స్ వైరల్!