కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి..!
TeluguStop.com
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై దాడి జరిగింది.చిక్ మంగళూరులో ఎమ్మెల్యే కుమారస్వామిని గ్రామస్థులు కొట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల హుల్లేమేన్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఏనుగు దాడిలో మృతిచెందింది.ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.
అయితే ఏనుగుల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గ్రామస్థులు ఎమ్మెల్యేపై దాడి చేసి దుస్తులు చించివేశారని సమాచారం.
ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!