చెన్నైలో దారుణం.. ప్రాణాలను బలి తీసుకున్న అక్రమ సంబంధం..!

ఇటీవలే తరచుగా వినపడుతున్న దారుణాలలో అక్రమ సంబంధానికి చెందిన దారుణాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అన్నీ తెలిసిన మనిషి చివరికి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు.అక్రమ సంబంధం కారణంగా ఓ మహిళ చెన్నై రైల్వే స్టేషన్లో( Chennai Railway Station ) దారుణ హత్యకు గురైంది.

దీంతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్ ప్రాంతమంతా భయంతో ఉలిక్కిపడింది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

"""/" / చెన్నై రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లో భువనేశ్వర్ మీనంబాక్కం, రాజేశ్వరి( Meenambakkam, Rajeshwari ) దంపతులు నివాసం ఉంటున్నారు.

జీవన ఉపాధి కోసం రాజేశ్వరి ప్రతిరోజు రైల్వే స్టేషన్లో పండ్లు, సమోసాలు అమ్ముతుండేది.

బుధవారం సాయంత్రం తన చిరు వ్యాపారాన్ని ముగించుకొని రోజులాగే ఇంటికి బయలుదేరింది.ఇంటికి వెళ్లడం కోసం సైదాపేట రైల్వేస్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తోంది.

"""/" / కాసేపటికి ఒక రైలు నుండి నలుగురు వ్యక్తులు దిగి, హఠాత్తుగా రాజేశ్వరిపై విద్యక్షణారహితంగా దాడి చేసి వెంటనే మరో రైలు ఎక్కి పారిపోయారు.

ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు చావు బతుకుల మధ్య ఉన్న రాజేశ్వరిని ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.

హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత రాజేశ్వరికి పలువురు వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని బయటపడ్డాయి.

బహుశా అక్రమ సంబంధాల కారణంగానే రాజేశ్వరి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.సైదాపేట రైల్వేస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు లేని కారణంగా నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.

అయితే పోలీసులు రాజేశ్వరి ఉపయోగించిన ఫోన్ డేటా ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని చెబుతున్నారు.

ఈ ఘటన జరిగి రెండు రోజులు అయినా కూడా ఈ విషయం బయటకు రాలేదు.

ఆమె చనిపోయిన తర్వాతనే ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

అజ్మల్ కసబ్‌ను గుర్తించిన ఈ పాప గుర్తుందా.. రతన్ గురించి ఏం చెప్తుందో వినండి..!