జగన్, కేసీఆర్ ఓడిపోయినా వాళ్లకు మంచి రోజులొస్తాయి.. వేణుస్వామి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Astrologer Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి లేనిపోని వివాదాలను కాంట్రవర్సీలను కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే.

హీరో హీరోయిన్ల అభిమానులు వేణు స్వామి పై దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు.

అయితే కొంతమంది రాజకీయ నాయకుల, సెలబ్రిటీల విషయంలో ఆయన చెప్పిన జాతకాలు రివర్స్ అవ్వడంతో వేణు స్వామి పై దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

"""/" / ఆ సంగతి పక్కన పెడితే.ఏపీలో 2024 ఎలక్షన్ లో చంద్రబాబు( Chandrababu ) ఓడిపోతాడు, జగన్ ( Jagan )మళ్ళీ సీఎం అవుతాడు.

నా మాట గనక తప్పయితే నేను జాతకాలు చెప్పను అంటూ బిల్డప్ ఇచ్చి జూన్ 6 న ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోయి కూటమి భారీగా గెలవడంతో అప్పటికప్పుడు వేణు స్వామి తాను ఇకపై జాతకాలు చెప్పను అంటూ వీడియో వదిలాడు.

ఆ తర్వాత పబ్ లో తేలాడు.తాజాగా వేణు స్వామి తాను సెలబ్రిటీస్ కి మత్రమే జాతకాలు చెప్పడం లేదు.

జగన్ గెలుస్తాడు, చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాక నన్ను ట్రోల్ చేసారు.నేను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాను.

అయినా రాహుల్ గాంధీ, జగన్, కెసిఆర్ ( Rahul Gandhi, Jagan, KCR )ఇప్పుడు ఓడిపోయినా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మంచి రోజులు వస్తాయి.

"""/" / మీరు చూస్తూ ఉండండి అని చెప్పాడు.తాను ప్రస్తుతం సెలబ్రిటీస్ కి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం లేదు, క్రికెట్ ప్రెడిక్షన్స్ ఇవ్వడం లేదు.

కానీ నేను ఇంటికొచ్చిన సెలబ్రిటీస్ కి జాతకాలు చెబుతున్నాను.అయినా నేను క్రికెట్ లో కానీ, లేదంటే రాజకీయాల్లో కానీ ఎవరు గెలుస్తారో ముందే చెబితే బెట్టింగ్స్ కాసి మోసపోతున్నారు.

వైసీపీ గెలుస్తుంది అని మీరు చెప్పారని నేను పందెం కట్టాను, ఓడిపోయాను అంటూ ఒకతను నాతో అన్నాడు.

అందుకే నేను ప్రిడిక్షన్స్ చెప్పడం మానేసాను.నేను చెప్పినందు వలన చాలామంది బెట్టింగ్స్ కాస్తున్నారు.

అందుకే నేను ప్రిడిక్షన్స్ ఇవ్వడం లేదు అని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వేణు స్వామి పై మరోసారి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

నిరీక్షణకు తెర.. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా