కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం

సూర్యాపేట జిల్లా కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ పై హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ క్రమంలో బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు కాలేజ్ భాగస్వాములు సుపారీ ఇచ్చారని తెలుస్తోంది.

కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం.

ఇందులో భాగంగా ముందుగా రూ.5 లక్షలు చెల్లించారు భాగస్వాములు.

కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టారు.ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన కాంతారావు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుపారీ గ్యాంగ్ లో 12 మందిని అరెస్ట్ చేశారు.

కళ్లకు గంతలు కట్టుకొని టమాటాలు కట్ చేశాడు.. వరల్డ్ రికార్డు బద్దలు..