హైదరాబాద్ లలిత్ బాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో హత్యాయత్నం

హైదరాబాద్ లలిత్ బాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో హత్యాయత్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఆజం షరీఫ్ కార్యాలయంలో చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే బాధిత వ్యక్తి ఇంటర్ విద్యార్థి అని తెలుస్తోంది.

గుహలో నిజంగానే 188 ఏళ్ల వ్యక్తిని రక్షించారా.? నిజమెంత?