తిరుగుబోతులుగా మారిన అషు రెడ్డి, స్రవంతి, అజయ్.. వీడియో వైరల్!

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది కంటెస్టెంట్ ల జీవితాలు మారిపోయాయి.

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు ఎటువంటి ఫాలోయింగ్ లేని వారు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత విపరీతమైన పాపులాటి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

ఇకపోతే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ అనేది ఓటీటీలో రావడంతో అంతగా క్లిక్ అవ్వక పోగా కంటెస్టెంట్లకు కూడా అంతగా కలిసి రాలేదు.

మొత్తానికి ఈ 24 గంటల ప్రసారం అనే కాన్సెప్ట్ జనాలకు అంతగా ఎక్కలేదు.

అసలు ఈ సీజన్ డిజాస్టర్‌గా నిలిచింది.మొదటి సీజన్ కంటెస్టెంట్లలో కొంత మంది మాత్రం పర్వాలేదనిపించారు.

ఇంకొంత మంది మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది.అందులో స్రవంతి చొక్కారపు కూడా ఉంది.

ఆమె వస్త్రాధారణ, బిగ్ బాస్ ఇంట్లో ఉన్న విధానం, ఆ తీరు అన్నీ కూడా ట్రోలింగ్‌‌కు గురయ్యాయి.

బిగ్ బాస్ హౌస్ లో అజయ్, స్రవంతి, అఖిల్ మాత్రం మంచి బాండింగ్‌తో ముందుకు వెళ్లారు.

అజయ్, అషు రెడ్డిల స్నేహం కూడా క్లిక్ అయింది.అయితే అషు రెడ్డికి అఖిల్ మీదున్నది మాత్రం ఏంటన్నది క్లారిటీ లేకుండా పోయింది.

ఇది ఇలా ఉంటే అజయ్, అషు రెడ్డి , స్రవంతి కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" / అజయ్, అషు స్నేహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ముగ్గురూ కలిసి బీచుల్లో చేస్తోన్న రచ్చ కూడా సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోని బట్టి చూస్తే వీరంతా కూడా గోవాకు వెళ్లినట్టు కనిపిస్తోంది.ఇక గోవా వీధుల్లో వీరు చేసిన అల్లరికి సంబంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఈ రీల్ వీడియోను అషూ రెడ్డి షేర్ చేసింది.ఇందులో అషూ, స్రవంతి ఇద్దరూ కూడా బీరు తాగినట్టు కనిపిస్తోంది.

అలా తాగుబోతులు, తిరుగుబోతుల్లా ఈ రీల్ వీడియోలో కనిపించారు.మొత్తానికి ఈ వీడియో మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వీడియో: హుండీ విరాళాలు లెక్కపెడుతూనే నోట్ల కట్టలు కాజేశారుగా..