Ashu Reddy: ఆ మీడియా ఛానెళ్లపై పరువు నష్టం దావా.. అషురెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కేపీ చౌదరి( KP Chaudhary )డ్రగ్స్ కేసు వ్యవహారం సంచలనంగా మారింది.

ఇప్పట్లో ఈ కేసు ముగిసేలా కనిపించడం లేదు.ఈ కేసులో బాగా రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది.

ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

కేపీ చౌదరితో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి( Ashu Reddy ), నటి సురేఖ వాణి ఇలాంటి వాళ్లకు సంబంధం ఉంది అంటూ వారి పేర్లు ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత కేపీ చౌదరి వ్యవహారంలో తన పేరు బయటకి రావడంపై నటి అషురెడ్డి మరోసారి స్పందించారు.

"""/" / ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది.

కాగా ఆ వీడియోలో భాగంగా అషు రెడ్డి మాట్లాడుతూ.కొన్ని మీడియా ఛానళ్లు నన్ను కించపరిచే విధంగా వార్తలు రాశాయి.

నా పేరు, ఫోన్‌ నంబర్‌ టెలికాస్ట్‌ చేశాయి.దీంతో నేను మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.

మొబైల్‌ నంబర్‌ను టెలికాస్ట్ చేయడం వల్ల నాకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

దీనివల్ల ఆ నంబర్‌ను నేను ఉపయోగించలేకపోతున్నాను.నన్ను కించపరిచేవిధంగా వ్యవహరించిన మీడియా ఛానళ్ల పై నేను పరువునష్టం దావా వేస్తాను.

కేపీ చౌదరితో గంటల తరబడి ఫోన్‌ మాట్లాడానని చెబుతున్నారు. """/" / అతడితో నాకున్న పరిచయం, ఫోన్‌ కాల్స్‌పై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.

ఇది జరిగినప్పుడు నేను వేరే దేశంలో ఉన్నాను.సంబంధం లేకుండా నా పై ఆరోపణలు చేస్తున్నందునే నేను వీడియో పోస్ట్‌ చేయకుండా ఉండలేకపోయాను అని అషురెడ్డి చెప్పుకొచ్చింది.

మరోవైపు ఈ విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.కేపకి ఇంకా ఏ సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూపి లాగే పనిలో ఉన్నారు పోలీసులు.

ప్రేక్షకులను గొర్రెలనుకున్నారా.. ఆ సినిమా తీయడమే ఎన్టీఆర్ చేసిన పెద్ద బ్లండర్?