అలాంటి మనుషుల్ని దూరం పెట్టండి.. సురేఖావాణి పోస్ట్ వైరల్..!

తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో ఎక్కువగా నటించి గుర్తింపును సంపాదించుకున్నారు సురేఖావాణి.

కెరీర్ తొలినాళ్లలో కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసిన సురేఖావాణి 2005 సంవత్సరంలో నటిగా కెరీర్ ను మొదలుపెట్టగా ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సురేఖావాణి ఫోటోలను తరచూ షేర్ చేస్తూ ఉంటారు.

సినిమాల్లో ట్రెడిషనల్ రోల్స్ లో ఎక్కువగా కనిపించే సురేఖా వాణి రియల్ లైఫ్ లో మాత్రం మోడ్రన్ గా కనిపిస్తూ ఉంటారు.

తాజాగా సురేఖావాణి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.ఆ పోస్ట్ లో సురేఖావాణి ఫేక్ పీపుల్ ను, ఫేక్ ప్రామిస్ లను నమ్మవద్దని.

అలా ఉంటే మాత్రమే జీవితం సంతోషంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.అయితే సురేఖా వాణి ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనే విషయం తెలియాల్సి ఉంది.

మరోవైపు సురేఖావాణి కూతురు సుప్రీత సినీరంగ ప్రవేశం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్టార్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోగా సురేఖావాణి కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ఆ వార్తలపై సురేఖావాణితో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

వాస్తవాలు రాయాలని ఫేక్ వార్తలు రాయవద్దని మీడియాకు సుప్రీత సూచనలు చేశారు.దుబాయ్ శీను, భద్ర, బొమ్మరిల్లు, దేనికైనా రెడీ, నాయక్, బాద్ షా, పవర్ సినిమాల్లోని పాత్రలు సురేఖావాణికి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో సురేఖావాణి ఎక్కువగా నటించారు.కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రాకతో సురేఖావాణి హవా గతంతో పోలిస్తే సరైన పాత్ర దొరికితే ఆమె మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

నేహా శెట్టి గురించి ఈ 10 విషయాలు పక్కా తెలుసుకోవాల్సిందే !