కరెంటు బిల్లు కోసం ఫ్యాన్స్‌కు మొరపెట్టుకున్న స్టార్.. ఎవరో తెలుసా?

కరోనా వైరస్ కారణంగా జనం అల్లాడిపోతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ తన ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక భారత్‌లోనూ ఈ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలకు చెందిన పనలు మూతపడ్డాయి.ఇక సినీ రంగానికి చెందిన అన్ని పనులు కూడా రెండు నెలలకు పైగా వాయిదా పడటంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

అయితే ఈ కరోనా వైరస్ కారణంగా తమకు మరో కొత్త సమస్య ఎదురవుతుందని వారు అంటున్నారు.

ఇటీవల నటి కార్తీకా నాయర్, తాప్పీ, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌లు కరెంట్ బిల్లుల తీరుపై మండిపడిన సంగతి తెలిసిందే.

తమకు ముందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో కరెంటు బిల్లులు వస్తున్నాయని వారు వాపోయారు.

కాగా తాజాగా ఈ జాబితాలో మరో బాలీవుడ్ హీరో అర్షద్ వార్సి చేరాడు.

తనకు లక్షకు మించిన కరెంటు బిల్లు వచ్చిందని ఆయన మండి పడుతున్నారు.అయితే తన కరెంటు బిల్లు కట్టేందుకు ఫ్యాన్స్ తనకు సాయం చేయాలని కోరుతున్నాడు.

ఈ క్రమంలో తాను వేసిన పెయింటింగ్స్ అమ్మకానికి పెట్టనున్నాడని, వాటిని ఫ్యాన్స్ కొనుగోలు చేసి తనను ఆదుకోవాలని అర్షద్ వార్సి కోరుతున్నారు.

మరి వచ్చే నెలలో తన కరెంట్ బిల్లు కట్టేందుకు కిడ్నీ అమ్ముకోవాల్సి వస్తుందేమో అని ఆయన భయపడుతున్నాడు.

వైరల్ వీడియో: వామ్మో.. రక్తంతో స్నానం చేసి సముద్రంలోకి దూకిన వ్యక్తి.. మాములుగా లేదుగా..