నేడు జిల్లాలో ఫైలేరియా నివారణ బృందం రాక

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఫైలేరియా నివారణకు సంబంధించిన టి ఏ ఎస్ -3 కార్యక్రమంలో రెండవ రోజు నేడు జిల్లాకు రాష్ట్ర పరిశీలనా బృందం అడిషనల్ డెరక్టర్ నాగయ్య , డబ్ల్యూహెచ్ఓ పరిశీలన బృందం డాక్టర్ శిరీష రావడం జరిగింది.

వీరు జిల్లాలోని పోతుగల్, ఎల్లారెడ్డిపేట ,గజసింగవరం, చందుర్తి, మల్యాల ,సనుగుల, అంబేద్కర్ నగర్ లలో నిర్దేశించిన స్కూల్స్ లో ఉన్న ఒకటవ, రెండవ తరగతి పిల్లలకు నిర్వహించిన రక్త పరీక్షలను పరిశీలించడం జరిగింది.

ఈరోజు 358 మందికి టెస్టులు చేయగా, ఇప్పటివరకు నాలుగు పాజిటివ్ కేసెస్ డిటెక్ట్ కావడం జరిగిందన్నారు .

ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.

ఓ.లింగం, మురళి ఎల్ టీ పాల్గొనడం జరిగింది.

వైరల్ వీడియో: వీధులలో నివసిస్తున్న మహిళకి ఊహించలేని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్..