రాష్ట్రస్ధాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ నందు అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్ధాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆర్మీ కల్నల్ కీట్స్ కె.

దాస్,ఆర్మీ అధికారులు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా ఎస్వీ కాలేజ్ వద్ద రిక్రూట్మెంట్ కోసం సిద్ధం చేసిన గ్రౌండ్ ను జిల్లా ఎస్పీ,పోలీసు అధికారులు, కల్నల్ కీట్స్ కె.

దాస్,మేజర్ తరణ్ జీత్,సుబేదార్ మేజర్ శివాజీలాల్ జాట్,దీపక్ రావత్ లతో కలిసి పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి ర్యాలీకి అభ్యర్థులు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం, ఎస్ఐలు,పోలీసు,రెవెన్యూ,మున్సిపల్,మెడికల్, ఎలక్ట్రిసిటీ,ఆర్టీవో,ఫైర్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

ఈ యంగ్ డైరెక్టర్స్ భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్స్ గా మారుతారా..?