ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ వ్యాప్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ మేరకు ఖమ్మం, పాల్వంచలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.కాగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వైరా, మధిర, పాలేరుతో పాటు సత్తుపల్లి నియోజకవర్గాలగా ఉన్న ఈ ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది.ఇక ఈ జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు మరియు కొత్తగూడెం నియోజకవర్గాలున్న సంగతి తెలిసిందే.

కాగా కౌంటింగ్ కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ సాధించారా?