అరి మూవీ డిఫరెంట్ ప్రమోషన్స్.. విడుదలకు ముందే మూవీ చూడవచ్చట!

డైరెక్టర్ జయ శంకర్ గురించి మనందరికి తెలిసిందే.పేపర్ బాయ్ మూవీతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు జయ శంకర్.

ఇకపోతే ఇప్పుడు అరి( Ari Movie ) అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది.ఇప్పటికే సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీ లు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు.

భగవద్గీత లోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని చెబుతున్నారు.కాగా ఈ సినిమాలో చాలా మంది నటి నటులు నటించి మెప్పించారు.

"""/" / అరిషడ్వర్గాల మీద తీసిన ఈ చిత్రం ఇప్పటి తరానికి చాలా ముఖ్యమని, సినిమా అద్భుతంగా ఉందని స్పెషల్ షోని( Special Show ) చూసిన వారంతా తెగ పొగిడేస్తున్నారు.

ఇకపోతే ఈ అరి మూవీని ప్రస్తుతం చూసేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది చిత్ర యూనిట్.

మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ల‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుందట.

సినీ లవర్స్ కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్ర యూనిట్ కల్పిస్తోంది.

ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు.కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయ శంకర్( Director Jayashanakr ) ఇలా ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. """/" / విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సాప్ నంబర్‌ ను కూడా డైరెక్టర్ జోడించారు.

విభిన్నంగా సినిమా తీయడమే కాదు.అంత కంటే విభిన్నంగా సినిమాని ప్రమోట్ చేస్తేనే ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించగలరు.

ఇప్పుడు అరి మూవీ టీమ్ కూడా ఇలానే డిఫరెంట్‌ గా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

రిలీజ్‌ కి ముందే సినిమాను చూపిస్తాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది.