బీసీ విద్యార్థి సంఘం మండల, కాలేజీ కమిటీల నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లో జూనియర్ కళాశాలలో బీసీ విద్యార్థి సంఘం కళాశాల కమిటీ,మండల కమిటీని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని గురువారంప్రకటించడం జరిగింది.

జూనియర్ కళాశాల కమిటీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్,ప్రధాన కార్యదర్శిగా గుడి కాడి కేశవర్ధన్,ప్రధాన కార్యదర్శిగా సందీప్, కార్యదర్శిగా నరేష్, మండల కమిటీ అధ్యక్షుడిగా లింగంపల్లి గౌతం,ప్రధాన కార్యదర్శిగా బండ మహేందర్, ఉపాధ్యక్షులుగా దీటు రాజేష్, బిసి విద్యార్థి కాలేజీ మహిళా కమిటీ కన్వీనర్ గా ఏంజెల్,కో కన్వీనర్ గా అక్షయ,మండల కన్వీనర్ గా స్ఫూర్తి గౌడ్, అమూల్య లను ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా నూతన కమిటీతో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సైనికులుగా పనిచేయాలని విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు.

బీసీ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన పెండింగ్స్ స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన హెచ్చరిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నవీన్, ప్రశాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

వృద్ధురాలే కానీ బ్రెడ్ పకోడీలు ఎంత ఫాస్ట్‌గా చేస్తుందో చూస్తే..??