ఎన్నికలకు సిద్ధం అవ్వండి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కనుక ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈసారి జరగబోయే ఎన్నికలలో టీడీపీ 160 స్థానాలలో గెలవడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉన్నారని.ప్రజలకు అండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని కోరారు.

ఇదే సమయంలో వివిధ పార్టీల నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉండటంతో.ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోపక్క వైసీపీ పార్టీ నేతలు మరియు మంత్రులు 2024లోనే ఎన్నికలకు వెళతామని చెబుతున్నారు.

 ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెలియజేయడం జరిగింది.

ఇలాంటి తరుణంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు ముందస్తు ఎన్నికల అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?