చంద్రబాబు, బొండా ఉమకు సమన్లు జారీ చేసిన రాష్ర్ట మహిళా కమిషన్..

అమరావతి: టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఆ పర్టీ రాష్ట్ర నేత బొండా ఉమకు రాష్ర్ట మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసింది.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.

బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం.అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.

ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు రావాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.

మేక‌ప్ అక్క‌ర్లేదు.. స‌హ‌జ అందం కోసం ఈ ఇంటి చిట్కాను పాటించండి!