పాపం ! ఇంగ్లిష్ రాక ఇబ్బందిపడుతున్న మంత్రి

ఇప్పుడు ఏపీలో భాష మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేయడం జరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షాలకు కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతో తాను పడుతున్న బాధను బయటకి వెల్లడించారు.

ఇంగ్లీష్ భాషపై పిల్లలకు పట్టులేకపోతే విద్యార్థుల భవిష్యత్ ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ రాకపోతే పేద విద్యార్థులు ఎలా రాణిస్తారని, ఇది ఆలోచించే తమ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని బొత్స చెప్పుకొచ్చారు.

మూడు సార్లు మంత్రిగా పనిచేసినా ఇంగ్లీషుపై తనకు కూడా పట్టలేదని, దీని కారణంగా తాను చాలా ఇబ్బందులకు గురయ్యానని తన బాధ చెప్పుకున్నారు బొత్స.

ఈ ఇద్దరు హీరోయిన్స్ స్టార్ హీరోయిన్లుగా ఎదగక పోవడానికి కారణం ఇదే…