ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‎ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ను హైకోర్టు సస్పెండ్ చేసింది.ఇటీవల ఏపీపీఎస్సీ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఈ పరీక్షను ఇంగ్లీష్‌ మీడియంలోనే రాయాలని పేర్కొంది.అయితే దీనిపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ కోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.కేంద్రం జారీ చేసే నోటిఫికేషన్లు హిందీలో కూడా ఉంటాయని చెప్పారు.

లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అవకాశం కోసం ఆశ పడకుండా నిజాయితీగా ఉన్న టాలీవుడ్ సెలబ్స్