ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు.కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనను హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.

గవర్నర్ అబ్దుల్ నజీర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఆయనకు ఆపరేషన్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని సమాచారం.

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారని తెలుస్తోంది.

అక్కడ ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న దేవర.. తారక్ మాస్ జాతర వేరే లెవెల్!