టీడీపీ, జనసేనలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శలు

టీడీపీ, జనసేనలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు.పవన్, చంద్రబాబు కలవడం చారిత్రక ఆవశ్యకతగా చెప్పుకొస్తున్నారని విమర్శించారు.

అధికారంలోకి రావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయ పడుతున్నారన్నారు.

ఇప్పటం గ్రామంలో పవన్ ఎందుకు ఆవేశంగా ప్రవర్తించారని ప్రశ్నించారు.జనసేనకు సభకు స్థలమిచ్చిన వారిలో ఒక్కరి ఇల్లు కూడా కూల్చలేదని సజ్జల స్పష్టం చేశారు.

ఒకరికి ఇవ్వాల్సిన అవార్డు మరొకరికి ఇచ్చారు..ఫ్యాన్స్ ఫుల్ యాంగ్రీ