కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మండిపాటు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఖండించారు.

కొఠియా గ్రామాలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివాదంపై కేంద్ర మంత్రి ఆ విధంగా మాట్లాడటం వివేకం అనిపించుకోదని రాజన్న దొర అన్నారు.

ఒడిశాపై ప్రేమ చూపిస్తూ ఆంధ్రా గో బ్యాక్ అనడం విచారకరమన్నారు.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్ని ప్రాంతాలనూ సమాన దృష్టిలో చూడాలని వెల్లడించారు.

Senior Politician K Keshava Rao : ఎన్ని విమర్శలు వచ్చినా… అదృష్టం అంటే కేకే దే