ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

సినీ పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

సినీ నేపథ్య గాయని వాణీ జయరాం(78) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

తెలుగుతోపాటు 14 భాషల్లో 20వేలకు పైన పాటలు పాడిన ఆమె ఇటీవల కేంద్ర ప్రభుత్వం.

పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది.కాగా ఆమె మరణం పట్ల చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

"""/"/ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు.

"త‌న మ‌ధుర‌మైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవ‌లందించి ఎంతో మంది హృద‌యాల‌ను గెలిచిన ప్ర‌ముఖ గాయ‌నీ, ప‌ద్మ భూష‌ణ్ వాణీ జ‌య‌రాం గారి మృతి సంగీత ప్రపంచానికి తీర‌ని లోటు.

ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను".

అనీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?