ఏపీ క్యాబినెట్ సమావేశం… కీలక నిర్ణయాలు ఇవే

ఏపీ ఎన్నిక సమయంలో టిడిపి, జనసేన , బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు విషయమై టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) దూకుడు పెంచారు.

ఒకవైపు గత వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఇప్పటికీ ఎత్తి చూపిస్తూనే, గత ప్రభుత్వ  నిర్ణయాల వల్లనే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఆలస్యం అవుతుందని, వీలైనంత త్వరలో ఆ హామీలను అమలు చేసి చూపిస్తామని పదే పదే చంద్రబాబుతో పాటు, కూటమి పార్టీల నాయకులు చెప్తున్నారు.

   ఈరోజు నిర్వహించిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో వీటిపై అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

  సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి కీలక అంశాల పైన ప్రధానంగా చర్చించారు.

ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపైన చర్చించారు. """/" / వరద ప్రభావిత ప్రాంతాలలో రుణాల రీ షెడ్యూల్ లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, ఆలయాల పాలక మండళ్ళ నియామకంలో తట్ట సవరణ,  ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం,  నూతన పారిశ్రామిక విధానం , కొత్త మునిసిపాలిటీలలో పోస్టుల భర్తీ వంటి అంశాల పైన ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా అనేక నిర్ణయాలను తీసుకున్నారు. """/" / ఏపీ క్లీన్ ఎనర్జీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

2024 -  29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0 కి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది .

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు.  ఎస్కో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకొచ్చారు.

నూతన ఎం ఎస్ ఎం ఈ  పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

  2030 నాటికి ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో ఎం ఎస్ ఎం   పాలసీని తీసుకువచ్చారు.

  మల్లవెల్లి పారిశ్రామిక పార్క్ లో 349 మందికి భూమి కేటాయింపుల పైన ఏపీ క్యాబినెట్( AP Cabinet ) నిర్ణయం తీసుకుంది .

ఇంకా అనేక అంశాలపై ఏపీ క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు.

పార్టీలో కలహాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ .. ఆ వ్యాఖ్యలపై హెచ్చరిక