రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన పురందేశ్వరి..

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి.ఇవాళ నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు.

అధికారులను అడిగి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు వివరిస్తున్నామని పురందేశ్వరి అన్నారు.

ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని బిజెపి పై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

నెల్లూరు రైల్వే స్టేషన్ ను 102 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆధునికరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఏపీ అభివృద్ధికి బిజెపి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు.

నీటిపారుదల, రహదారుల నిర్మాణాల తో పాటు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు బిజెపి శ్రీకారం చెప్పిందని పురందరేశ్వరి అన్నారు.

అమరావతి పై నేడు కీలక నిర్ణయం… రంగంలోకి ఐఐటి నిపుణులు