బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోకపోవడానికి కారణం తెలిపిన అనుష్క శర్మ...!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

మేడే రోజు జన్మించిన ఈ బ్యూటీ ఈ సంవత్సరం తన బర్తడే సెలబ్రేషన్ దూరంగా ఉన్నట్లు అందరికి తెలిసిన విషయమే .

ఈ విషయంపై తాజాగా అనుష్క శర్మ స్పందిస్తూ.ముందుగా తనకు బర్తడే శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ  క్రమంలో  సోషల్ మీడియా వేదికగా అనుష్కశర్మ ఒక వీడియోను అభిమానులతో షేర్  చేసింది.

ఆ వీడియోలో అనుష్క శర్మ `నిజంగా తన రోజుని చాలా ప్రత్యేకంగా చేశారు.

అందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.కానీ కరోనా మహమ్మారి విజృంభన సమయంలో ప్రజలంతా బాధపడుతున్నారు.

ఇంతటి పెయిన్‌ మధ్య బర్త్ డే సెలబ్రేషన్‌ చేసుకోవడం కరెక్ట్ కాదు అని, భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి మద్దతివ్వాలి.

"అని  చెప్పుకొచ్చారు.ఇంకా ఈ  సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆపదలో , సహాయం కావాల్సిన వారికి సహాయం చేయాలని కోరింది.

అలాగే అనుష్క , విరాట్ కోహ్లీతో కలిసి వారి వంతు సహాయం త్వరలో చేయబోతున్నట్లు.

అంతేకాకుండా ఈ ఉద్యమంలో మీరు కూడా భాగం కావాలని అభిమానులను కోరింది అనుష్క.

ఈ తరుణంలో దయచేసి అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని అనుష్క శర్మ కోరారు.

ఇక అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక  అనుష్క శర్మ చివరిసారిగా ` అంగ్రేజ్‌ మీడియం`లో.ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నిజ్జర్ హత్య కేసు : భారత్‌పై మరోసారి ఆరోపణలు చేసిన ఇండో కెనడియన్ నేత జగ్మీత్ సింగ్