వివాహం తర్వాత జీవితంపై అనుష్క కామెంట్స్‌..!

బాలీవుడ్‌ టాప్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు వెలిలిగిన అనుష్క శర్మ, విరాట్‌ కొహ్లీతో పెళ్లయ్యాక సినిమాల వేగాన్ని తగ్గించింది.

అడపాదడపా తప్ప పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.ఇక వామికకు జన్మనిచ్చిన తర్వాత అనుష్క సినిమాలకు మరింత దూరమైంది.

నిర్మాణ సంస్థ స్లేట్జ్‌ నుంచి కూడా తప్పుకుంది.ఇకపై సినిమాలు నిర్మించబోనని తెలిపింది.

కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని కేటాయిస్తోంది.ఈ నిర్ణయాల వెనక కారణాన్ని తాజాగా వెల్లడించింది అనుష్క శర్మ.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.‘సినిమా రంగం అంటే మామూలు విషయం కాదు.

ఎంతో పోటీ నెలకొని ఉంటుంది.నిత్యం ఆ పోటీలో పరుగు పెట్టాల్సిందే.

ఒక్కసారి పరుగు తగ్గిస్తే వేరే వాళ్ళు మన ప్లేస్ లోకి వస్తారు.కానీ, జీవితాన్ని ఆస్వాదించి.

హాయిగా గడపాలి అంటే మాత్రం ఈ పోటీ నుంచి ఏదో సమయంలో తప్పుకోవాల్సిందే.

లేకుంటే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాం.పెళ్లి తర్వాత అటు నటిగా.

ఇటు ఇంట్లో పనులు చూసుకోవడం చాలా కష్టం.ఆ రెండు బాధ్యతలను సమతూకం చేయలేము.

కానీ ఇది చాలామంది అర్థం చేసుకోలేరు.అందుకే మొదటగా నిర్మాణ సంస్థ నుంచి తప్పుకున్నా.

"""/" / ఇక నటిగానూ కొన్ని సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నా.స్వానుభవంతో పనిచేసే మహిళలపై నాకు గౌరవం మరింత పెరిగింది’ అని చెప్పింది.

ప్రస్తుతం అనుష్క శర్మ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ అనే చిత్రంలో నటిస్తున్నది.ఈ సినిమా భారత క్రికెట్‌ జట్టు మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కుతున్నది.

క్రికెట్ నేపథ్యంలో సినిమా వస్తుండగా ప్రస్తుతం అనుష్క భర్త విరాట్ కోహ్లీ నుండి క్రికెట్ చిట్కాలు నేర్చుకుంటున్నట్లు సమాచారం.

ఎన్నికలవేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు..!!